Friday, July 26, 2024

గులాబీ నుంచి రాజయ్య జంప్…?

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య గులాబీని వీడే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది… ఘనపూర్ ఎమ్మెల్యే టికెట్ తనకు ఇవ్వకుండా కడియం శ్రీహరి కి ఇవ్వడంతో మనస్థాపం చెందిన ఆయన గులాబీని వదిలి హస్తం అందుకోనున్నట్లు సమాచారం… ఈ నేపథ్యంలో ఆయన సోమవారం సాయంత్రం కాంగ్రెస్ నేత ,మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నర్సింహ తో వరంగల్ లోని ఓ హోటల్ ల్లో భేటీ ఐయ్యారు… పొద్దున బి ఆర్ ఎస్ నేతలతో కలిసి వల్మిడి సీతరామ చంద్ర స్వామి ఆలయ కార్యక్రమంలో పాల్గొని అక్కడ సరదాగా కడియం తో ముచ్చటించిన రాజయ్య సాయంత్రం దామోదర రాజనర్సింహ ను కలవడం చర్చనీయాంశంగా మారింది…. ఈ భేటీ తో రాజయ్య జంప్ కావడం కాంగ్రెస్ లో చేరడం ఖాయమనే కామెంట్లు వినిపిస్తున్నాయి…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular