Thursday, May 9, 2024

డ్రైవర్ పై డి ఈ ఓ దాడి

హన్మకొండ డీ ఈ ఓ అబ్దుల్ హై తన డ్రైవర్ పై విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు.మధ్యాహ్న భోజనానికి వెళ్లిన డ్రైవర్ రాం సింగ్ తన ఫోన్ ఎత్తనందుకు గురువారం డీ ఈవో కార్యాలయంలో కి పిలిపించుకుని తలుపుపెట్టి మరి పిడిగుద్దులు గుద్ది గాయపర్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.బాధితుడు రామ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం గురువారం మధ్యాహ్నం భోజనానికి వెళ్లిన రాం సింగ్ ఫోన్ సైలెంట్ లో ఉండటం వల్ల డీ ఈ ఓ ఫోన్ ఎత్తలేదని దాంతో కోపంతో ఊగి పోతూ ఆఫీసు లోకి పిలిచి మరీ దాడికి పాల్పడ్డాడని అంతే కాకుండా శుక్రవారం రోజు మరోసారి తన ఇంటికి పిలిపించుకుని తన భార్య పిల్లల ముందు కులం,జాతి పేరుతో దూషిస్తూ తన తల్లిని చెప్పారని పదాలతో దుర్భాశలాడాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
బాధితుడు రాం సింగ్ తనపై జరిగిన దాడికి సుబేదారి పోలీస్ స్టేషన్లో డీ ఈ ఓ అబ్దుల్ హై పై ఫిర్యాదు చేశాడు.బాధితుడు పిర్యాదు చేసిన విషయం తెలుసుకున్న డీ ఈ ఓ రాం సింగ్ ను మధ్యవర్తులతో రాజీకి రమ్మంటు కాళ్ళ బేరనికి వచ్చినట్లు సమాచారం.ఇదిలా ఉంటె విషయాన్ని బయటకు తెలియకుండా డీ ఈ ఓ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా గిరిజనుడిపై దాడికి పాల్పడ్డ డీ ఈ ఓ పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని లేకుంటే ఆందోళనలు తప్పవని విద్యార్థి, గిరిజన సంఘాలు హెచ్చరిస్తున్నాయి…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular