Friday, May 17, 2024

కాంగ్రెస్ లోకి వీరగోని రాజ్ కుమార్..?బి ఆర్ ఎస్ కు పరకాలలో షాక్

పరకాల నియోజకవర్గంలో బి ఆర్ ఎస్ కు భారీ షాక్ తగలనుంది..నియోజకవర్గం నుంచి మరో బి ఆర్ ఎస్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి… బి ఆర్ ఎస్ గీసుగొండ మండల పార్టీ అధ్యక్షుడు వీరగోని రాజ్ కుమార్ త్వరలోనే హస్తం పార్టీ తీర్థం పుచ్చుకొనున్నట్లు తెలుస్తోంది….కొండా మురళి, గోపాల నవీన్ రాజ్ కు అత్యంత సన్నిహితుడైన వీరగోని రాజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ లో చేరడానికి వీరిద్దరి ప్రోత్సాహం ఉన్నట్లు తెలుస్తోంది…ఈ నెల 17 న రాహుల్ వరంగల్ పర్యటన సందర్భంగా రాజ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది…. కాగా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎన్నికల ప్రచారం మొదలయిన దగ్గర నుంచి వీరగోని రాజ్ కుమార్ ప్రచారానికి దూరంగానే ఉంటున్నట్లు తెలిసింది…గీసుగొండ లో చల్లా నిర్వహించిన ప్రచారానికి సైతం ఆమధ్య వీరగోని డుమ్మా కొట్టినట్లు గులాబీలో చర్చ జరుగుతోంది…. మరోవైపు బి ఆర్ ఎస్ గీసుగొండ మండల అధ్యక్షుడిగా ఉన్న వీరగోని రాజ్ కుమార్ కు మండలంలోని దాదాపు అన్ని గ్రామాల్లో మంచి పట్టు ఉంటుంది…ఇప్పుడు ఇతను కాంగ్రెస్ లో చేరితే పరకాల నియోజకవర్గం లో గులాబీ కి భారీ దెబ్బగానే భావించొచ్చు…..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular