Thursday, July 25, 2024

విద్యుత్ ఏ ఈ విచారణ ఏమైనట్లు?

హన్మకొండ జిల్లా విద్యుత్ శాఖ లో ఓ ఉన్నతాధికారి ఆ ఏ ఈ పై జరుగుతున్న విచారణ ను జాప్యం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత నాలుగు నెలల క్రితం నయీం నగర్ ఏ డి ఈ పరిధిలోని గోపాలపూర్ ఏ ఈ ని ఉన్నతాధికారులు మరోచోటుకు బదిలీ చేశారు. అయితే ఈ బదిలీ వెనుక ఓ పెద్దసారు హస్తం ఉందని సస్పెండ్ కావాల్సిన ఏ ఈ ని విచారణ పేరుతో బదిలీ చేపించి ఆ ఏ ఈ కి గాడ్ ఫాదర్ ల మారినట్లు విద్యుత్ శాఖలో జోరుగా ప్రచారం సాగుతోందని తెలుస్తోంది. సదరు ఏ ఈ లక్ష్మణ్ నాయక్ పై విచారణ మొదలై మూడు నెలలు కావస్తున్నా ఇప్పటికి విచారణ మాత్రం పూర్తి కావట్లేదని సమాచారం. విచారణ జాప్యం వెనుక ఓ యూనియన్ లీడర్ హస్తం ఉన్నందునే ఆ విచారణ ఆలస్యం అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular