Thursday, July 25, 2024

తూర్పు గులాబీలో భారీ కుదుపు

తూర్పు గులాబీలో భారీ కుదుపు వచ్చేలా ఉంది…బి ఆర్ ఎస్ కు చెందిన కీలక నాయకుడి తో సహా ఓ పి ఏ సి ఎస్ ఛైర్మెన్,డిప్యూటీ మేయర్ తో పాటు మరో నలుగురు బి ఆర్ ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరబోతున్నారు…వీరు శనివారం ఉదయం టి పి సి సి చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారు….బి ఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరబోయే వారిలో బి ఆర్ ఎస్ నాయకుడు గోపాల నవీన్ రాజ్,డిప్యూటి మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్,
కార్పొరేటర్ కేడల పద్మ జనార్దన్,
కార్పొరేటర్ గుండేటి నరేందర్,
కార్పొరేటర్ రామ తేజస్వి శిరీష్ లు ఉన్నారు …వీరితోపాటు మాజీ కార్పొరేటర్ బాసని చంద్రశేఖర్ మరికొందరు మాజీ కార్పొరేటర్ లు, తూర్పు ముఖ్య నాయకులు రేపు ఉదయం 8 .15 నిమిషాలకు కొండ దంపతుల ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం…

గులాబీ కి దెబ్బ….


నలుగురు కార్పొరేటర్లు వారిలో డిప్యూటీ మేయర్ ,బి ఆర్ ఎస్ కీలక నేత కాంగ్రెస్ లో చేరడం తూర్పు లో గులాబీకి భారీ కుదుపు గానే చెప్పవచ్చు… దీని ప్రభావం తూర్పు లో బాగానే ఉండేట్లు ఉంది…ఇది గులాబీకి పెద్ద దెబ్బ గానే కనపడుతుంది…ఓ వైపు నామినేషన్ల పర్వం ముగిసి ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఇలా వారు కాంగ్రెస్ గూటికి చేరుకోవడం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే బి ఆర్ ఎస్ అభ్యర్థి నన్నపునేని కి మింగుడు పడని విషయమే…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular