Thursday, July 25, 2024

ఏ కే ఆసుపత్రిలో దారుణం


హన్మకొండలోని ఏ కే ఆసుపత్రి లో దారుణం చోటుచేసుకుంది… కాలికి దెబ్బతగిలిందని నడుచుకుంటూ వెళ్లిన వ్యక్తి డాక్టర్ సూది ఇవ్వగానే ప్ర్రాణం విడిచాడు…దింతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు…మృతుడు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… ధర్మసాగర్ మండలం ముల్కలపల్లి కి చెందిన మునిగాల వేంకటేశ్వర్లు(45) వనమాల కానిపర్తి క్వారీ లో గ్రానైట్ కట్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు… సోమవారం సాయంత్రం విధులు ముగించుకుంటున్న సమయంలో క్వారీలో ప్రమాదవశాత్తు కింద పడడంతో కాలికి దెబ్బ తగిలింది… దింతో చికిత్స కోసం హన్మకొండలోని ఏ కే ఆసుపత్రికి వచ్చాడు…దింతో ఆసుపత్రి సిబ్బంది చికిత్స చేయడానికి సీనియర్ డాక్టర్ లేరని జూనియర్ డ్యూటీ డాక్టర్ వద్దకు తీసుకువెళ్లారు… ఆ డాక్టర్ ఇంజక్షన్ వేసిన కొద్దిసేపటికే వెంకటేశ్వర్లు మృతిచెందాడని అతని కుమారుడు రాకేష్,మృతుని సోదరి మణెమ్మ న్యూస్10 కు తెలిపారు…ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ తండ్రి మరణించాడని ,మరణించిన తర్వాత వేరే ఆసుపత్రికి తీసుకువెల్లమని తమతో ఆసుపత్రి వైద్యులు చెప్పారని ఆవేదన చెందాడు….

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular