బి ఆర్ ఎస్ లో చేరిన రాకేశ్ రెడ్డి

ఇటీవల బీజేపీ కి గుడ్ బై చెప్పిన ఏనుగుల రాకేశ్ రెడ్డి బి ఆర్ ఎస్ లో చేరారు… వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఎంత కష్ట పడిన బీజేపీ తనను ఏమాత్రం పట్టించుకోలేదని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసిన ఆయన తెలంగాణ భవన్ లో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ సమక్షంలో ఆయన గులాబీ తీర్థం పుచ్చుకున్నారు….రాకేశ్ రెడ్డి తో పాటు స్టేషన్ ఘనపూర్ బీజేపీ నాయకుడు మాదాసు వెంకటేష్,జనగామ నుంచి బక్క నాగరాజు బి ఆర్ ఎస్ లో చేరారు…రాకేశ్ రెడ్డి తో పాటు హన్మకొండ జిల్లా బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో బి ఆర్ ఎస్ లో చేరారు…ఈ కార్యక్రమంలో   జనగామ అసెంబ్లీ అభ్యర్థి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ స్టేషన్ ఘనపూర్ అభ్యర్థి కడియం శ్రీహరి,వర్ధన్నపేట అభ్యర్థి, ఎమ్మెల్యే ఆరూరి రమేష్,మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత తదితరులు పాల్గొన్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here